ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే వన్డే ప్రపంచకప్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్లలో ప్రపంచకప్ గెలవడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు. దీనికి సమాధానం కష్టం ఎందుకుంటే ప్రతీ మ్యాచ్లో ఒక్కరే జట్టును గెలిపించలేదు. దీంతో ఫైనల్ వరకు క్రెడిట్ అందరి ప్లేయర్స్కు దక్కింది. అయితే ఫైనల్ గెలుపు మాత్రం ఒక్కరికే ఆపాదించడం కొందరికి నచ్చడం లేదు. దీనిపై గౌతమ్ గంభీర్ బహిరంగంగానే విమర్శలకు దిగాడు. తాజాగా ఫైనల్ గెలుపుపై టీమిండియా సీనియర్ ఆటగాడు, ఫ్యామిలీ మ్యాన్ సురేశ్ రైనా స్పందించాడు.
‘చిన్నప్పడు బ్యాట్ పట్టినప్పుడే అనుకున్నా ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో సభ్యుడిగా ఉండాలని. ఆ కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ మ్యాచ్ తాలూకు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఫైనల్ వరకు మా ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ఫైనల్ మ్యాచ్లో ఛేదనలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. అయితే ఈ క్రమంలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి జోడి మూడో వికెట్కు 83 పరుగులు నమోదుచేసి విజయానికి గట్టి పునాది వేశారు. నా దృష్టిలో టీమిండియా ప్రపంచకప్ ఫైనల్లో గెలవడంలో ఇదే టర్నింగ్ పాయింటని భావిస్తాను. ఒత్తిడిలోనూ వారిద్దరూ బాధ్యతాయుతంగా ఆడిన తీరు అద్భుతం.
అయితే విరాట్ కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్ రావాల్సింది కానీ ఇద్దరు లెప్టాండర్స్ అవుతుండటం, ముత్తయ్య మురళీధరన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్లో సమర్థవంతంగా ఆడిన అనుభవం ఉండటంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఫైనల్ వంటి పోరులో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. అయితే వికెట్లు పడకుండా, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ధోని, గంభీర్లు చాలా బాగా ఆడారు. అయితే సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్ వెనుదిరగడం నిరుత్సాహపరిచింది. యువరాజ్తో కలిసి ధోని టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే గంభీర్-కోహ్లిలు మూడో వికెట్కు మంచి భాగస్వామ్యం నమోదు చేయకుంటే టీమిండియా విజయం అంత సులభం అయ్యేది కాదని నా భావన’ అంటూ రైనా పేర్కొన్నాడు.
చదవండి:
ఆ ఒక్క సిక్సర్తో వరల్డ్ కప్ గెలవలేదు!
వెస్టిండీస్ మురిసే.. స్టోక్స్ ఏడిచే
ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను
ప్రపంచకప్ ఫైనల్ క్రెడిట్ ఎవరికి?.. రైనా క్లారిటీ!
Published Fri, Apr 3 2020 8:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న ఆశయమే నాకు ఆదర్శం
పేదలపై ఎందుకీ కక్ష
మూడో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతం
ఎన్నికల ప్రక్రియ ఉన్నతమైన బాధ్యత
వడగళ్ల వర్షం.. పంటకు నష్టం
జగన్తోనే సంక్షేమ పథకాల కొనసాగింపు
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement