అంబుడ్స్మన్ ముందు హాజరైన పాండ్యా
ముంబై: టీవీ టాక్ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీసీసీఐ విచారణను ఎదుర్కొంటున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మంగళవారం ముంబైలో బోర్డు అంబుడ్స్మన్ జస్టిస్ డీకే జైనా ఎదుట హాజరయ్యాడు.
తనపై చెలరేగిన వివాదానికి సంబంధించి అతను వివరణ ఇచ్చాడు. పాండ్యాతో పాటు ఇందులో భాగంగా ఉన్న లోకేశ్ రాహుల్ నేడు అంబుడ్స్మన్ ముందుకు వెళ్లి తన వాదన వినిపిస్తాడు. వీరిద్దరి వివరణను పరిగణలోకి తీసుకుంటూ అంబుడ్స్మన్ తన తుది నివేదికను సీఓఏ చీఫ్ వినోద్ రాయ్కు సమర్పిస్తారు.