జడేజాపై జరిమానా | BCCI to appeal against Ravindra Jadeja's fine over spat with James Anderson | Sakshi
Sakshi News home page

జడేజాపై జరిమానా

Jul 26 2014 1:15 AM | Updated on Sep 2 2017 10:52 AM

జడేజాపై జరిమానా

జడేజాపై జరిమానా

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పేసర్ జేమ్స్ అండర్సన్‌తో జరిగిన గొడవ వివాదంలో భారత్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై జరిమానా పడింది.

బీసీసీఐ ఆగ్రహం
 సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పేసర్ జేమ్స్ అండర్సన్‌తో జరిగిన గొడవ వివాదంలో భారత్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై జరిమానా పడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1 కింద దోషిగా తేలడంతో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ప్రకటించారు. ఇంగ్లండ్ టీమ్ మేనేజిమెంట్ ఆరోపించినట్టుగా లెవల్-2 నిబంధనను జడేజా అతిక్రమించలేదని స్పష్టం చేశారు. గురువారం జరిగిన ఈ విచారణకు ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు వారి లీగల్ కౌన్సిల్స్, సాక్షులు, బీసీసీఐ నుంచి ఎంవీ శ్రీధర్ హాజరయ్యారు.
 
 నాటింగ్‌హామ్ మ్యాచ్ రెండో రోజు లంచ్ విరామ సమయంలో జడేజా, అండర్సన్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ జరిమానాపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆటగాడికి అండగా నిలుస్తూ ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేస్తామని తెలిపింది. ‘ఐసీసీ నిర్ణయం మాకు సంతృప్తిని కలిగించలేదు. దీనికి వ్యతిరేకంగా మేం అప్పీల్ చేసుకుంటాం. రవీంద్ర జడేజా ఎలాంటి తప్పు చేయలేదని బీసీసీఐ నమ్ముతోంది. అతడికి మేం పూర్తిగా మద్దతిస్తున్నాం’ అని బోర్డు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement