రేపు వైఎస్‌ జగన్‌  నామినేషన్‌

YS Jagan Mohan Reddy Nomination Process Tommorrow - Sakshi

సాక్షి, పులివెందుల : వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) పులివెందులలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి పులివెందులకు చేరుకుంటారన్నారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి ఆయన ప్రసంగించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ అనంతరం తిరిగి హెవికాప్టర్‌లో బయలుదేరుతారన్నారు.   బహిరంగ సభకు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top