‘ఏపీకి రాజధాని లేకుండా చేశారు’

Vasireddy Padma Slams Chandrababu Naidus Ruling - Sakshi

నాలుగేళ్లలో టీడీపీ సర్కార్‌ 4లక్షల కోట్ల అవినీతి

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా పోయిందని, కనీసం ఉమ్మడి రాజధాని కూడా లేకుండా చేశారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతికి టీడీపీ సర్కార్‌ పాల్పడిందని ఆమె ఆరోపించారు. గత నాలుగేళ్ల పాలనలో ఏపీ సర్కార్‌ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలు చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఏపీకి అస్థిత్వం లేకుండా అన్యాయం చేశారని విమర్శించారు. 

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టేలా పాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు అభద్రతాభావం కల్పించిన చంద్రబాబును మళ్లీ ఎందుకు ఆశీర్వదించాలని ఏపీ సీఎంను వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేసిన మిమ్మల్ని ఎందుకు గెలిపించాలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చెప్పాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top