ఆర్టీసీ అప్పులన్నీ తీరుస్తాం: ఉత్తమ్‌  | Uttamkumar Reddy comments on RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అప్పులన్నీ తీరుస్తాం: ఉత్తమ్‌ 

Sep 22 2018 2:38 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttamkumar Reddy comments on RTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ అప్పులన్నీ తీర్చి సంస్థను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు కుమార్‌రెడ్డి, రవిరాజు, నరేందర్, మౌలానా, కమాల్‌రెడ్డి, కరీం ఆయన్ను శుక్రవారం గాంధీభవన్‌లో కలసి ఆర్టీసీ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. దీనిపై ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీని లాభాపేక్ష కలిగిన సంస్థగా కాకుండా, ప్రజారవాణా సంస్థగా గుర్తించాలన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement