మోదీ తల్లి గురించి మాట్లాడితే నాలుక చీలుస్తా  | Somu Veerraju Warns Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మోదీ తల్లి గురించి మాట్లాడితే నాలుక చీలుస్తా 

Apr 4 2019 2:21 PM | Updated on Apr 4 2019 2:28 PM

Somu Veerraju Warns Chandrababu Naidu - Sakshi

మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నాలుకు చీలుస్తామని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు.

అనంతపురం టవర్‌ క్లాక్‌: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి గురించి సీఎం చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నాలుకు చీలుస్తామని బీజేపీ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ ఐదేళ్లూ అవినీతి, అక్రమాలే చేశారన్నారు. దొంగలెక్కలు చూపి అవార్డులు దక్కించుకున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్ల నిధులు విడుదల చేస్తే.. ఆ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పైగా కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి తానే ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కేంద్రం రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తే.. చంద్రబాబు ఆ నిధులను తన సొంత కార్యక్రమాలకు వాడుకున్నారని ఆరోపించారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై చర్చ పెడతామని దమ్ముంటే ఆయన పాల్గొనాలని సవాల్‌ విసిరారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 7న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి దేవినేని హంస, బీజేపీ నాయకులు లలితకుమార్, దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement