ఒక్క లోక్సభ సీటు గెలవగలరా?!
ఆర్జేడీకీ బీజేపీ సవాల్
సాక్షి, పాట్నా : వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జేడీ) బీహార్లో ఒక్క లోక్సభ సీటునైనా గెలవగలదా? బీజేపీ నేత ఆ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నిత్యానంద రాయ్ సవాల్ విసిరారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమారులు అవినీతి, అక్రమాల వంటి పలు కేసుల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే లాలూకు, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రంలో చరిష్మా లేదని.. ఈ పరిస్థితుల్లో ఆర్జేడీ వచ్చే ఎన్నికల్లో ఒక్క లోక్సభ సీటును సైతం గెలవలేదని ఆయన చెప్పారు. దసరా-మొహర్రం సమయంలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అభాసు పాల్జేసేందుకు విపక్షాలన్నీ కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల పాత్రను అర్థం చేసుకున్న ప్రజలు హుందాగా ప్రవర్తించారని అన్నారు.
సంబంధిత వార్తలు