ఓటరు జాబితాలో అక్రమాలపై సీఈసీకి రాహుల్ లేఖ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంత ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని, తుది జాబితాను ప్రకటించకుండా వాయిదా వేయాలని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మరోమారు ఎన్నికల సంఘాన్ని కలసి వినతిపత్రం అందజేసింది. మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలోని బృందం శనివారం ఎన్నికల కమిషనర్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దంతానపల్లి గ్రామపంచాయతీ ఉప ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ ఆధారాలు అందజేశారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ లేఖ రాశారని మీడియాకు వెల్లడించారు. చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని మర్రి శశిధర్రెడ్డి చెప్పారు.