తెనాలి రూరల్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై కక్ష సాధించేందుకే టీఆర్ఎస్ నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు’’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆరోపించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదరావూరు– కూచిపూడి మార్గంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు జగన్ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని అన్నారని, వారే ఇప్పుడు చంద్రబాబు గారిపై కక్ష సాధించేందుకు జగన్కు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పట్ల పవన్కున్న సానుకూలతను ఆయన తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయని విశ్లేషకులు అంటుండడం గమనార్హం.
దోపిడీ లేని పాలన అందిస్తే అభ్యంతరం లేదు
వైఎస్సార్సీపీ, టీడీపీ దశాబ్దాలపాటు పాలించవచ్చని, తనకేం అభ్యంతరం లేదని, అయితే ఇసుక మాఫియా లేని, ప్రజాధన దోపిడీ లేని పాలనను అందించాలని పవన్ అన్నారు. వైఎస్ జగన్ 30 ఏళ్లు సీఎంగా చేయాలని ఉందని తనకెవరో తెలియజేశారని, అలాగే బాబు(చంద్రబాబు) రావాలి, వాళ్ల బాబు (లోకేష్) రావాలని వీళ్లూ కోరుకుంటున్నారని, ఎవరు వచ్చినా, అవినీతి లేని పాలన అందించాలన్నారు. 30, 40 ఏళ్లక్రితం నాయకులు చేసిన తప్పులకు ఇప్పుడు రాష్ట్రం విడిపోయి, ఆ తప్పులకు మనం బాధ్యత వహించాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు తమకు ఆఖరు ఎన్నికలు కాదని, ప్రారంభం మాత్రమేనని జనసేన నాయకులకు చెప్పినట్టు ఆయన తెలిపారు. 25 కిలోల బియ్యం బస్తా కాదు... 25 ఏళ్ల భవిష్యత్తు కావాలన్నదే యువత నినాదమవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తోపాటు ఎమ్మెల్యే రావెల కిశోర్బాబు, మాజీ మంత్రి పి.బాలరాజు, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.
రైతులు, మహిళలు, విద్యార్థుల అసహనం..
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే పవన్ బహిరంగసభ అనంతరం వ్యవసాయక్షేత్రంలో విద్యార్థులు, రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారంటూ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే సాయంత్రం 5.25 గంటలకు బహిరంగసభలో ప్రసంగించిన పవన్ సంక్రాంతి సంబరాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. భోగి మంటలు వేసిన తర్వాత రాత్రి 7.13 గంటలకు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్నం నుంచి అన్నం నీళ్లు లేకుండా ఆయనకోసం నిరీక్షించిన విద్యార్థులు, మహిళలు, రైతులు తీవ్ర అసహనానికి, ఆవేదనకు గురయ్యారు.
చంద్రబాబుపై కక్ష సాధించేందుకే..
Published Mon, Jan 14 2019 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement