మా ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లేరు

None Of TRS MLAs Are In Touch With The BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుట్రలు, కుతంత్రాలతోనే రాజకీయాలు నడపాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. బీజేపీ రాజకీయ దుర్మార్గపు క్రీడ ఆడుతోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ పేర్కొనడం నీతి మాలిన రాజకీయానికి నిద ర్శనమన్నారు. గురువారమిక్కడ కర్నె విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లే రని, కేంద్రమంత్రులే తమతో టచ్‌లో ఉన్నారని వ్యం గ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మం త్రులు దేశవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యక్రమాల ను ఎలా అమలు చేయాలని ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులందరూ కేసీఆర్‌ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top