బీజేపీలో చేరినా కేసులు ఎదుర్కోక తప్పదు: జీవీఎల్‌ | No Future for TDP In Andhra Pradesh Said By BJP MP GVL Narasimha Rao | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరినా కేసులు ఎదుర్కోక తప్పదు: జీవీఎల్‌

Jun 21 2019 6:54 PM | Updated on Jun 21 2019 11:25 PM

No Future for TDP In Andhra Pradesh Said By BJP MP GVL Narasimha Rao - Sakshi

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు(పాత చిత్రం)

ఢిల్లీ: టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదని చెప్పారు. ఎవరి కేసులు వారే వ్యక్తిగతంగా ఎదుర్కోక తప్పదన్నారు. చట్టప్రకారమే టీడీపీ రాజ్యసభపక్షం విలీనం అయ్యిందని వెల్లడించారు. కోవర్టు ఆపరేషన్లు కోసం వస్తోన్న వారిపై నిఘా ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రులు చేసిన టీడీపీకి మా గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement