ఈ సారైనా నాకు ఓటేయండి!

mla swamy request to people for vote in janmabhoomi program - Sakshi

జన్మభూమి సభలో ఎమ్మెల్యే స్వామి వేడుకోలు

సుంకిరెడ్డిపాలెం(పొన్నలూరు): మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేశాను. గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు కనీసం ఈ సారైన నాకు ఓట్లు వేయండని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి గ్రామస్తులకు విన్నవించారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికైన మీరు మారి ఈ సారైన నాకు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే పలుమార్లు గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదని అనడంతో అవాక్కైన గ్రామస్తులు మీరు దగ్గరుడి చూసినట్లు పదే పదే నాకు ఓటు వేయలేదంటున్నారేమిటని ప్రశ్నించారు.

స్థానిక సర్పంచ్‌ వరికూటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులను తనను చేయనివ్వకుండా పక్క గ్రామాలకు చెందిన అధికారపార్టీ నాయకులతో చేయించడం ఏమిటంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్‌ మట్టి తోలించి బిల్లులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, ప్రత్యేక అధికారి ఉమాదేవి, ఎంపీపీ వీరకుమారి, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top