ఇందిరాగాంధీకి మోదీ, సోనియా, రాహుల్ నివాళి | pm modi, Sonia and Rahul pay tribute to Indira Gandhi on her birth anniversary | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీకి మోదీ, సోనియా, రాహుల్ నివాళి

Nov 19 2016 8:37 AM | Updated on Oct 22 2018 9:16 PM

ఇందిరాగాంధీకి మోదీ, సోనియా, రాహుల్ నివాళి - Sakshi

ఇందిరాగాంధీకి మోదీ, సోనియా, రాహుల్ నివాళి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని మోదీ,సోనియా గాంధీ, రాహుల్ నివాళులర్పించారు.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. నేడు (శనివారం) ఆమె జయంతి సందర్భంగా తొలి ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్నిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ తెలిపారు.

ఇందిర కోడలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మనవడు రాహుల్‌గాంధీ ఆమె జయంతి సందర్భంగా మాజీ ప్రధాని సేవల్ని గుర్తుచేసుకున్నారు. ఇందిరాగాంధీ 1917, నవంబర్ 19న జన్మించిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమల నెహ్రూ దంపతులకు ఇందిర ఏకైక సంతానం. 1966 -1977 వరకు, ఆ తర్వాత 1980లో మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో అక్టోబర్ 31వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement