ఇందిరాగాంధీకి మోదీ ఘన నివాళి | Modi pays tribute to Indira Gandhi on birth anniversary | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీకి మోదీ ఘన నివాళి

Nov 19 2015 11:49 AM | Updated on Aug 21 2018 9:33 PM

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఇందిరాగాంధీ జయంతి.ఈ నేపథ్యంలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 1917, నవంబర్ 19న జన్మించిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమల నెహ్రూ దంపతులకు ఇందిర ఏకైక సంతానం.

1966 -1977 వరకు  ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1980లో మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో అక్టోబర్ 31వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే  హత్య చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement