ఆ బాధ వాళ్లకూ తెలియాలి | It is time to give a befitting reply to Pakistan, terrorists | Sakshi
Sakshi News home page

ఆ బాధ వాళ్లకూ తెలియాలి

Sep 23 2018 4:35 AM | Updated on Sep 23 2018 4:35 AM

It is time to give a befitting reply to Pakistan, terrorists - Sakshi

జైపూర్‌ / ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సైన్యం, ఉగ్రవాదుల అనాగరిక చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొంతును పాక్‌ సైనికులు కత్తితో కోయడం, కశ్మీర్‌లో పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటనలపై రావత్‌ ఈ మేరకు స్పందించారు. జైపూర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత జవాన్లపై పాకిస్తాన్‌ సైన్యం, ఉగ్రవాదులు పాల్పడుతున్న ఇలాంటి అనాగరిక, ఆటవిక ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పాక్‌ వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ బాధేంటో వాళ్లకూ తెలియాలి. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్‌ పాటించే అనారిగక, ఆటవిక విధానాలను భారత్‌ అనుసరించకూడదు’ అని తెలిపారు. సరిహద్దులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను పాక్‌ సైన్యం తుపాకితో కాల్చి, గొంతు కోయడంపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావనీ, దీనిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.  

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పాక్‌  
రావత్‌ వ్యాఖ్యలపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే దేశ ప్రయోజనాల రీత్యా శాంతినే ఆకాంక్షిస్తున్నామని పాకిస్తాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement