ఢిల్లీ-ఆగ్రా హైవేపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి..
Jul 28 2017 9:30 AM | Updated on Aug 30 2018 4:10 PM
ఆగ్రా: ఢిల్లీ-ఆగ్రా హైవేపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పక్కకు నిలిపిన రెండు ట్రాక్టర్లను వేగంగా దూసుకొచ్చిన పెట్రోలు ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరిన పోలీసులు క్షతగాత్రులను ఆగ్రా ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
ఈటా జిల్లాలోని అవగధ్ గ్రామానికి చెందిన 60 మంది రెండు ట్రాక్టర్లలో గోవర్థన్ పరిక్రమాకు బయలు దేరారు. తినడానికి రోడ్డు పక్కన ఆపగా వేగంగా వచ్చిన పెట్రోలు ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను గర్తించి వారి బంధువులకు అప్పగించామని పోలీసు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement