మహమ్మారి బారిన 13 మంది పోలీసులు | 13 Policemen In Gurugram Test Positive | Sakshi
Sakshi News home page

గురుగ్రాంలో కోవిడ్‌-19 కలకలం

May 26 2020 5:32 PM | Updated on May 26 2020 5:32 PM

 13 Policemen In Gurugram Test Positive - Sakshi

కోవిడ్‌-19పై ముందువరుసలో నిలిచి పోరాడుతున్న 13 మంది పోలీసులకు మహమ్మారి సోకింది.

చండీగఢ్‌ : గురుగ్రాంలో 13 మంది పోలీసులకు మంగళవారం కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది. గత వారం ఇద్దరు పోలీసులకు కరోనా వైరస్‌ సోకిన క్రమంలో తాజాగా 13 మంది పోలీసులు మహమ్మారి బారిన పడటంతో కోవిడ్‌-19 విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిప వారిలో ఎక్కువమందికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.45 లక్షలు దాటగా, 60,000 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా మరణాల రేటు 2.87 శాతానికి దిగిరావడం సానుకూల పరిణామమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

చదవండి : కరోనా: చెలరేగిన హింస.. రాళ్ల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement