టెక్నాలజీ మాయలో... | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ మాయలో...

Published Sat, Aug 5 2017 2:42 AM

టెక్నాలజీ మాయలో...

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ముఖ్యతారలుగా రామ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తారామణి’ను అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత డి. వెంకటేష్‌. ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

టెక్నాలజీ మాయలో పడి యువత ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? దానివల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు కూడా ఉంటాయి. తమిళంలో ఈ సినిమా ట్రైలర్‌ను హీరో కమల్‌హాసన్, పాటలను రజనీకాంత్‌ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement