ఊహకందని మలుపులతో... | Sakshi
Sakshi News home page

ఊహకందని మలుపులతో...

Published Sun, Nov 15 2015 11:20 PM

ఊహకందని మలుపులతో...

శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టుమణి, సన ప్రధాన పాత్రల్లో ఎస్.డి. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వజ్రం’. ఈ చిత్రాన్ని సాయిరంగా ఫిలింస్ పతాకంపై ‘ఓదార్పు యాత్ర’ పేరుతో కె. రంగారావు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘
 రాజకీయ నేపథ్యంలో జరిగే థ్రిల్లర్ కథ ఇది.

కుటుంబమంతా కలసి చూసే సందేశాత్మక చిత్రం. తమిళంలో వంద రోజులాడింది. ‘గోలీ సోడా’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన పలువురు నటీనటులు ఇందులో నటించారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. పాటలు-మాటలు: వెన్నెలకంటి-మలూరి వెంకట్.
 

Advertisement
Advertisement