సోషల్ మీడియా టూ టాలీవుడ్.. టాలీవుడ్ టూ బిగ్బాస్
బిగ్బాస్ ఇంట్లోకి మూడో హౌస్మేట్గా అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ఓ స్పెషల్ ప్రోమోతో ఎంట్రీ ఇచ్చిన అషూ.. తన వ్యక్తిగత విషయాలను అందులో పంచుకుంది. విశాఖపట్నంలో పుట్టి మాస్టర్స్ చదవడానికి యూఎస్ వెళ్లినట్లు తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేప్పుడు ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో కొన్ని స్టోరీస్ పోస్ట్ చేశానని అవి వైరల్ అయ్యేసరికి ఓవర్నైట్లో స్టార్ అయ్యాననే ఫీల్ కలిగేదని పేర్కొంది.
సోషల్ మీడియాలో పాజిటివిటితో పాటు తనపై నెగెటివిటీ కూడా పెరిగిందని అయితే అదంతా ఎక్కువగా పట్టించుకోలేదని, ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసిందని తెలిపింది. గతేడాది డబ్ స్మాష్ క్యాటగిరీలో దీప్తి సునయన హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ను సొంతం చేసుకున్న అషూ రెడ్డి.. చల్ మోహనరంగ చిత్రంతో టాలీవుడ్లో మెరిసింది. మరి బిగ్బాస్లో కూడా ఎంటర్టైన్ చేస్తూ చివరి వరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.
మరిన్ని వార్తలు