ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రారంభం | minister tummala nageswara rao inaugurates trs party new office in khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రారంభం

Jan 1 2018 1:48 PM | Updated on Jan 1 2018 1:49 PM

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు మంచి స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యాలయం దేవాలయంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తామని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని తుమ్మల తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement