కారు బాంబు దాడి; 34 మంది మృతి | Terrorists Attack In Kabul | Sakshi
Sakshi News home page

కారు బాంబులతో దద్దరిల్లిన కాబూల్‌

Jul 1 2019 1:24 PM | Updated on Jul 1 2019 1:40 PM

Terrorists Attack In Kabul - Sakshi

కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నగరం ఒక్కసారిగా బాంబులతో దద్దరిల్లింది. అమెరికా ఎంబసీకి దగ్గర్లో కారు బాంబుతో ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించారు.ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా, 65 మందికి పైగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చడం గమనార్హం. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement