కాలిఫోర్నియా: ప్రాణాంతక మలేరియా వ్యాధి సంక్రమాన్ని నిరోధించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నిరకాల మందులను కనిపెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దోమల నుంచి సంక్రమించే ప్లాస్మోడియం పరాన్న జీవి వల్ల మానవులకు మలేరియా వ్యాధి వస్తోందన్న విషయం తెలిసిందే. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవిని దోమలోనే చంపేస్తే అన్న ఆలోచన అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలకు వచ్చింది.
అంతే...ఓ రకమైన దోమ డీఎన్ఏను జన్యు మార్పిడి పద్ధతి ద్వారా మార్చేసి ప్లాస్మోడియం పరాన్న జీవిని నియంత్రించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అంటే దోమలోకి ప్లాస్మోడియం పరాన్న జీవి ప్రవేశించగానే దోమలో వచ్చిన జన్యు మార్పుల కారణంగా ఆ పరాన్న జీవి ఆదిలోనే చచ్చిపోతుంది. ఫలితంగా ఆ దోమ మానవులను కుట్టినప్పటికీ మలేరియా సోకే ప్రసక్తే లేదన్న మాట. జన్యు మార్పిడికి గురైన దోమకు పుట్టే పిల్ల దోమలకు కూడా ఈ పరాన్న జీవిని బతక్కుండా నిరోధించే శక్తి వస్తుంది. కనీసం మూడు తరాల వరకు దోమ జాతిలో జన్యుపరంగా ఈ శక్తి సంక్రమిస్తుందని పరిశోధక నిపుణుల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఆంథోని జేమ్స్ వివరించారు. దోమ డీఎన్ఏ జన్యు మార్పిడి ప్రక్రియకు 'క్రిస్పర్' అని నామకరణం కూడా చేశారు.
ఈ జన్యు మార్పిడి ప్రక్రియ కోసం భారత్లో కనిపించే 'అనోఫెలెస్ స్టెఫెన్సీ' జాతికి చెందిన దోమను ఎంపిక చేసుకున్నారు. ఇలా ప్రతి జాతికి చెందిన దోమలను ఎంపిక చేసి ల్యాబ్లో జన్యు మార్పిడి ద్వారా ప్లాస్మోడియం పరాన్న జీవిని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తూ పోతే కొంతకాలానికి వాటి సంతానానికి కూడా ఈ శక్తిని ప్రసాదించవచ్చు. అలా చేసినట్టయితే కొంతకాలానికి ఏ రకమైన దోమలు మానవులను కుట్టినా మలేరియా వ్యాధి సంక్రమించదు. ఇదొక్కటే మలేరియాను సమూలంగా నిర్మూలించలేదని, ఇదొక మార్గం మాత్రమేనని డాక్టర్ ఆంథోని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శక్తివంతమైన మందులను కనుగొనడం, మలేరియా సోకినప్పుడు వాటిని వాడడం తప్పనిసరని ఆయన చెప్పారు. ఎందుకంటే, దోమ జాతులన్నింటిలో డీఎన్ఏలో జన్యు మార్పిడి తీసుకరావడం అంత సులభం కాదు.
ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల మంది, అంటే దాదాపు ప్రపంచ జనాభాలో సగం మంది మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. వారిలో ఏడాదికి 5,80,000 మంది మృత్యువాత పడుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవికి వాహకంగా పనిచేస్తున్న దోమ జాతినే నిర్మూలిస్తూ పోవడం శ్రేయస్కరంగదా! అన్న ఆలోచన శాస్త్రవేత్తలకు రాకపోలేదు. అలాంటి చర్యలు తీసుకున్నట్లయితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, ఇప్పటికే దోమల ద్వారా నశించిపోతున్న ఇతర రకాల పరాన్న జీవులు మరోరకంగా విజృంభించే అవకాశం ఉందని కొంత మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు.
ఆ దోమ కుట్టినా మలేరియా రాదట..
Published Tue, Nov 24 2015 5:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement