ఘోర ప్రమాదం 23 మంది మృతి | 23 dead in Pakistan mountain bus accident | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం 23 మంది మృతి

Sep 24 2016 9:37 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఘోర ప్రమాదం 23 మంది మృతి - Sakshi

ఘోర ప్రమాదం 23 మంది మృతి

కొండ ప్రాంతంలో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది

ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ముజఫరాబాద్కు ఉత్తర దిశగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అదుపుతప్పిన బస్సు.. సుమారు 100 మీటర్ల ఎత్తునుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడటంతో కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 23 మందికి పైగానే మృతిచెందారని, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని రక్షించడంతో పాటు.. ముగ్గురి మృతదేహాలు మాత్రం లభించాయని స్థానిక అధికారి గిలానీ వెల్లడించారు. నదిలో కొట్టుకుపోయిన బస్సుతో పాటు మృతదేహాలకోసం గాలింపు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement