కోర్టుపై మిలిటెంట్ల దాడి | 10 killed, several injured as Taliban attack Afghan court | Sakshi
Sakshi News home page

కోర్టుపై మిలిటెంట్ల దాడి

Jun 5 2016 10:53 PM | Updated on Mar 28 2019 6:10 PM

లోగర్ రాష్ట్రంలోని కోర్టుపై మిలిటెంట్లు ఆదివారం దాడి చేయడంతో 10 మంది మరణించారు.

కాబుల్: లోగర్ రాష్ట్రంలోని కోర్టుపై మిలిటెంట్లు ఆదివారం దాడి చేయడంతో 10 మంది మరణించారు. మృతుల్లో ఒక సీనియర్ న్యాయమూర్తి కూడా ఉన్నారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మాహుతి బాంబర్లు కోర్టుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 11 గంటలకు పుల్-ఎ-ఆలమ్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో ఐదుగురు సాధారణ పౌరులు మరణించారు. లోగర్ ప్రాంతీయ అప్పీల్ కోర్టు భవనంలో దాడి జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్రమ్ నేజల్ ఈ దాడిలో మరణించారు. నేజత్ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే నియమితులయ్యారు. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడిలో పాల్గొన్నారు. కోర్టు భవనం లోపల ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement