ఆర్టీసీ చార్జిల పెంపు దుర్మార్గం | ysrcp express anger over rtc ticket prices hike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చార్జిల పెంపు దుర్మార్గం

Oct 23 2015 10:08 PM | Updated on May 29 2018 4:23 PM

ప్రయాణికుడి నడ్డి విరిగేలా ఆర్టీసీ చార్జిలు పెంచిన చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది.

హైదరాబాద్: ప్రయాణికుడి నడ్డి విరిగేలా ఆర్టీసీ చార్జిలు పెంచిన చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. చార్జిల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను దుర్మార్గంగా పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎడాపెడా పన్నులతో ఆర్టీసీని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు మళ్లీ ఒకేసారి 10 శాతం ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్ సీపీ విమర్శించింది. ఓ వైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా, ఆర్టీసీ చార్జిలు పెంచడం ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేట్ రవాణాను అరికట్టి డీజిల్ పై వ్యాట్ ఎత్తివేయాలని, ఒక్కపైసా చార్జీ పెంచకుండా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement