'ఖాళీ కుర్చీలకు ఉపన్యసించిన సోనియా' | Venkaiah Naidu takes on Congress Party | Sakshi
Sakshi News home page

'ఖాళీ కుర్చీలకు ఉపన్యసించిన సోనియా'

May 3 2014 9:55 AM | Updated on Mar 29 2019 9:24 PM

'ఖాళీ కుర్చీలకు ఉపన్యసించిన సోనియా' - Sakshi

'ఖాళీ కుర్చీలకు ఉపన్యసించిన సోనియా'

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశించడంపై బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశించడంపై బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందన్నారు. అందుకే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ చేసే సవాళ్లకు సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ తమ పార్టీ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతుందని విమర్శించారు.

 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమీ తథ్యమన్నారు. నేడో రేపో దిగిపోయే వాళ్ల మాటలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు మోడీపై విచారణకు ఆదేశాలు జారీ చేసే అధికారం హోం మంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిన్న సీమాంధ్రలోని గుంటూరులో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ జరిగింది... ఆ సభకు జనం నుంచి స్పందన కరువైందని... దాంతో ఖాళీ కుర్చీలకు సోనియా ఉపన్యాసం చేశారని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement