'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం! | Unknown persons wounded Pawan fan | Sakshi
Sakshi News home page

'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం!

Jan 4 2015 7:27 PM | Updated on Mar 22 2019 5:29 PM

'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం! - Sakshi

'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం!

'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం జరిగింది.

హైదరాబాద్: 'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం జరిగింది. కొందరు దుండగులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈరోజు శిల్పకళావేదికపై  'గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే.

 ఈ కార్యక్రమానికి  గుంటూరు జిల్లాకు చెందిన  పవన్ కల్యాణ్ అభిమాని కన్నా శ్రీనివాస్ వచ్చారు.   శ్రీనివాస్ శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి పరారయ్యారు.  తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement