యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి 32 అవతారాలు | telangana cm kcr review meeting on yadadri development | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి 32 అవతారాలు

Nov 7 2016 7:27 PM | Updated on Aug 15 2018 8:58 PM

యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి 32 అవతారాలు - Sakshi

యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి 32 అవతారాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాలు ప్రతిబింబించేలా ప్రతిష్టించాలని, లక్షమందికి పైగా భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలని, యాదాద్రికి నలువైపులా నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని, ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై కాటేజీలు, ఈశాన్య భాగంగా 13 ఎకరాల గుట్టపై రెసిడెంట్ సూట్ నిర్మించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఇప్పుడున్న బస్టాండ్, డిపోలను మరోచోటుకు మార్చాలని ఆయన పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement