'వాస్తవాలు తెలుసుకుని కోదండరాం మాట్లాడాలి' | Singireddy Niranjan Reddy takes on kodandaram | Sakshi
Sakshi News home page

'వాస్తవాలు తెలుసుకుని కోదండరాం మాట్లాడాలి'

Jul 27 2016 12:48 PM | Updated on Jul 29 2019 2:51 PM

టి జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నీరంజన్రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ : టి జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నీరంజన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో విపక్షాల ఆరోపణలను పట్టుకుని ప్రో. కోదండరాం మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోదండరాంకు ఆయన హితవు పలికారు. దొంగలతో కలసి ప్రజలను మభ్యపెట్టేందుకు కోదండరాం యత్నిస్తున్నారని నీరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement