శంషాబాద్ విమానాశ్రయంలో 20 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 20 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానంలో ఈ పొడిని దోహాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా కస్టమ్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేసినప్పుడు దొరికిపోయింది.
ఈ పొడిని ఇక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నించిన సూడాన్ దేశస్థుడు ఒకరిని కస్టమ్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతడిని విమానాశ్రయంలోని పోలీసు అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.