breaking news
red sandal powder
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎర్రచందనం పొడి సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో 21 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. సుడాన్కు చెందిన ఓ నైజీరియన్ జంట ఎర్రచందనం పొడిని హైదరాబాద్ నుంచి దోహాకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిద్దర్నీ విమానాశ్రయంలోని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ నెల 8వ తేదీన సూడాన్ దేశస్థుడు ఎర్రచందనం తరలిస్తు పట్టుబడిన విషయం తెలిసిందే. -
శంషాబాద్లో ఎర్రచందనం పొడి స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో 20 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానంలో ఈ పొడిని దోహాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా కస్టమ్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేసినప్పుడు దొరికిపోయింది. ఈ పొడిని ఇక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నించిన సూడాన్ దేశస్థుడు ఒకరిని కస్టమ్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతడిని విమానాశ్రయంలోని పోలీసు అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.