'కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారు' | ponnam prabhakar takes on kcr and chandrababu | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారు'

Jul 1 2016 12:14 PM | Updated on Aug 15 2018 9:35 PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం మెదక్లో నిప్పులు చెరిగారు.

మెదక్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం మెదక్లో నిప్పులు చెరిగారు. కేసీఆర్, చంద్రబాబు చీకటి ఒప్పందం వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా చేయడం కాదు చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. కేసీఆర్ స్వార్థం వల్లే అడ్వకేట్లు రోడ్డున పడుతున్నారని విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement