- ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలంగాణ ఏసీబీ యాక్షన్.. ఏపీ సీఐడీ రియాక్షన్
- ఏపీ సీఎం తనయుడు లోకేశ్ డ్రైవర్కు ఏసీబీ నోటీసులు
- మత్తయ్య కేసులో కేటీఆర్ గన్మన్, డ్రైవర్కు ఏపీ తాఖీదులు
- ఇరువురి నోటీసులూ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారమే..
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ వ్యక్తిగత డ్రైవర్ కొండల్రెడ్డికి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నోటీసులు ఇవ్వగా... మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఏపీ సీఐడీ అధికారులు మంత్రి కేటీఆర్ గన్మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు. ఇరువురూ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారమే నోటీసులు జారీ చేయడం గమనార్హం. బుధవారం ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
విచారణ నిమిత్తం గురువారం ఉదయం 10.30 గంటల కల్లా తమ కార్యాలయంలో హాజరు కావాలని కొండల్రెడ్డిని ఏసీబీ ఆదేశించింది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి, అక్కడ నుంచి టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వెళ్లిన ఏసీబీ అధికారులు కొండల్రెడ్డి కోసం ఆరా తీశారు. అయితే అక్కడ లేడని తేలడంతో బుధవారం యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి గోడపై నోటీసులు అంటించారు.
ఏపీ సీఐడీ అధికారులు కూడా ఇదే తీరుగా స్పందించారు. తొలుత నోటీసులతో బుధవారం రాత్రి బేగంపేటలోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి, అక్కడ్నుంచి నందిహిల్స్లో ఉన్న కేసీఆర్ పాత నివాసానికి, కేటీఆర్ నివాసానికి వెళ్లారు. కేటీఆర్ గన్మన్, డ్రైవర్లలో ఎవరూ అక్కడ లేరని తేలడంతో రాత్రి 11 గంటల సమయంలో ఖైరతాబాద్లోని తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్డబ్ల్యూ) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా లేకపోవడంతో గురువారం జానకిరామ్, సత్యనారాయణ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన విషయం విదితమే.
విచారణకు విజయవాడ రండి
మంత్రి కేటీఆర్కు గన్మన్, డ్రైవర్లుగా ఉన్న జానకిరామ్, సత్యనారాయణ తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ) కానిస్టేబుళ్లుగా ఉన్నారు. మత్తయ్య కేసులో వీరికి సాక్షులుగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణ కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సీఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
రెండేళ్ల కిందటి కేసులో కేటీఆర్ గన్మన్కు నోటీసులు
పెందుర్తి (విశాఖపట్నం): రెండేళ్ల కిందటి కిడ్నాప్ కేసులో మంత్రి కె.తారకరామారావు గన్మన్కు నోటీసులు పంపినట్లు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి బుధవారం విలేకరులకు తెలిపారు. 2013 ఫిబ్రవరిలో ఒడిశాకు చెందిన మార్వాడీ వ్యాపారులను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నించారని, అప్పటి పెందుర్తి ఎస్సై వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కిడ్నాపర్లు అతనిపై వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు వివరాలు, ఆచూకీ తెలుసునన్న సమాచారంతో మంత్రి కేటీఆర్ గన్మన్ మధుసూదన్రెడ్డి, ఆయన అనుచరుడు సతీష్రెడ్డిలకు నోటీసులు పంపినట్లు సీఐ తెలిపారు.
పోటాపోటీ నోటీసులు
Published Thu, Aug 13 2015 5:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement