టీఆర్‌ఎస్‌లో దోపిడీదారుల పునరేకీకరణ: భట్టి | Looters reunification in TRS: Bhatti | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో దోపిడీదారుల పునరేకీకరణ: భట్టి

Jun 18 2016 2:44 AM | Updated on Mar 18 2019 7:55 PM

టీఆర్‌ఎస్‌లో దోపిడీదారుల పునరేకీకరణ: భట్టి - Sakshi

టీఆర్‌ఎస్‌లో దోపిడీదారుల పునరేకీకరణ: భట్టి

టీఆర్‌ఎస్‌లో ముసలం పుడుతున్నదనే అభద్రతాభావంతోనే సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో ముసలం పుడుతున్నదనే అభద్రతాభావంతోనే సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాధనాన్ని దోపిడీ చేసే కుట్రలో భాగంగా దళారులు, దోపిడీదారులు, కాంట్రాక్టర్లు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, అలాంటివారిని పునరేకీకరణ చేసి కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని భట్టి ఆరోపించారు.

ఈ దోపిడీపై, దోపిడీదారులపై కాంగ్రెస్‌పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు.  ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అబద్ధాలపై త్వరలోనే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement