'తలసానిని మంత్రిగా కొనసాగించడం అనైతికం' | congress leader shabbir ali fires on cm kcr over electric, rtc charges increasing | Sakshi
Sakshi News home page

'తలసానిని మంత్రిగా కొనసాగించడం అనైతికం'

Jun 23 2016 1:49 PM | Updated on Sep 5 2018 2:25 PM

'తలసానిని మంత్రిగా కొనసాగించడం అనైతికం' - Sakshi

'తలసానిని మంత్రిగా కొనసాగించడం అనైతికం'

టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రిగా కొనసాగించడం అనైతికమని కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు.

హైదరాబాద్: టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రిగా కొనసాగించడం అనైతికమని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు.

హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ...47 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు యోచనను సీఎం కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని  షబ్బీర్ డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement