'దానం లేకుండానే గవర్నర్ ను కలిశారు' | congress conflicts in hyderabad | Sakshi
Sakshi News home page

'దానం లేకుండానే గవర్నర్ ను కలిశారు'

Jan 29 2015 1:21 PM | Updated on Mar 18 2019 9:02 PM

'దానం లేకుండానే గవర్నర్ ను కలిశారు' - Sakshi

'దానం లేకుండానే గవర్నర్ ను కలిశారు'

రాజధాని నగరంలో కాంగ్రెస్లో విభేదాలు రేగుతున్నాయి.

హైదరాబాద్: గ్రేటర్  కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ లేకుండానే మిగతా నేతలు గురువారం గవర్నర్ను కలిశారు. గవర్నర్ను కలిసిన వారిలో మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, బండా కార్తీక తదితరులు ఉన్నారు.

నగరంలో ఇళ్లు కట్టిస్తామని కొందరు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కాగా  దానం నాగేందర్ పార్టీ మారుతున్నారని, అందుకే కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రమే దానం గాంధీభవన్కు వస్తున్నారని పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement