ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో విద్యుత్ చార్జీలు మరోసారి ప్రజలకు భారీగా షాక్ ఇవ్వబోతున్నాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో విద్యుత్ చార్జీలు మరోసారి ప్రజలకు భారీగా షాక్ ఇవ్వబోతున్నాయి. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. రూ.7200 కోట్ల మేర ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలను డిస్కంలు అందచేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్యం కానుంది.