'ధైర్యముంటే నోటిఫికేషన్ ఇవ్వండి' | ysrcp MLA slams ap government over land pooling | Sakshi
Sakshi News home page

'ధైర్యముంటే నోటిఫికేషన్ ఇవ్వండి'

Oct 27 2015 1:02 PM | Updated on Aug 18 2018 5:48 PM

రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించేవరకు అసైన్డ్ భూముల రైతుల అవస్థలు ప్రభుత్వానికి తెలియలేదా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

గుంటూరు:  రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించేవరకు అసైన్డ్ భూముల రైతుల అవస్థలు ప్రభుత్వానికి తెలియలేదా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ ఇంతకాలం రైతులు ఆందోళన చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ నిద్రపోయారన్నారు.

భూములు ఇవ్వక పోతే భూ సేకరణ చేస్తామనడం అవివేకానికి నిదర్శనమని ఆయన తెలిపారు.  ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే వెనకడుగేసిన సంగతి గుర్తుంచుకోవలన్నారు. అయినా భూ సేకరణ చేయాలనుకుంటే దమ్ము, ధైర్యముంటే నోటిఫికేషన్ ఇవ్వండని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement