దేవీ అలంకారాలు
ఎనిమిదవ రోజు దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం, 17–10–2018
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవీ నమోస్తుతే ‘‘
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు తన దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తుంది. లోక కంటకుడైన దుర్గమాసురుడిని సంహరించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై స్వయంగా ఆవిర్భవించింది ఆ తల్లి. రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది అష్టమి తిథి నాడే. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను తొలగి సద్గతులు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే మంత్రం సకల జనులకూ శుభాలను కలుగచేస్తుంది. దుర్గతులను నశింపచేసి సద్గతులను ప్రసాదించి, ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం సకల శ్రేయోదాయకం.