రేపు జిల్లాకు విజయమ్మ | ys vijayamma election campaign in Kakinada | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు విజయమ్మ

Apr 20 2014 5:01 AM | Updated on Aug 14 2018 4:32 PM

రేపు జిల్లాకు విజయమ్మ - Sakshi

రేపు జిల్లాకు విజయమ్మ

సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాకు వస్తున్నారు.

తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో ప్రచారం సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాకు వస్తున్నారు. ఈ విషయాన్ని  పార్టీ ప్రోగ్రాం రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి శనివారం రాత్రి విలేకరులకు తెలియచేశారు. విజయమ్మ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తారన్నారు. తొలుత తుని నియోజకవర్గంలో ప్రచారం చేసి, అనంతరం అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం చేరుకుని ప్రచారం నిర్వహిస్తారన్నారు. తర్వాత జగ్గంపేట నియోజకవర్గానికి వెళతారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement