కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు

సాక్షి, విజయవాడ: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు  విజయవాడ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జె.వి.ఆర్‌.కె.రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 07051 నంబరు కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 16, 17 తేదీల్లో రాత్రి 6 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30లకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ రైలు వయా విజయవాడ, గుంటూరు మీదుగా రాక పోకలు సాగిస్తుందని తెలిపారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top