ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి | young man dead in road accident | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి

Aug 12 2016 7:01 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని కోరపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది.

 

  • ఒకరి పరిస్థితి విషమం 
జమ్మికుంట రూరల్‌: ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని కోరపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల, మృతుడి కుటంబ సభ్యుల కథనం ప్రకారం.. వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన ముసిపట్ల సతీశ్‌రెడ్డి(22), కర్ర శ్రీనివాస్‌రెడ్డి స్థానిక ఎఫ్‌సీఐలో పని ముగించుకుని కోరపల్లికి వెళ్లారు. అక్కడి నుంచి జమ్మికుంట వైపుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. జమ్మికుంటలో ఇసుకను అన్‌లోడ్‌ చేసి విలాసాగర్‌ వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ కోరపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో సతీశ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ గరిగంటి రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రాక్టర్‌ను ఠాణాకు తరలించారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement