బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ మృతి | women conductor died in hospital | Sakshi
Sakshi News home page

బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ మృతి

Jul 17 2015 2:25 PM | Updated on Sep 3 2017 5:41 AM

పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలో బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది.

జంగారెడ్డి గూడెం: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలో బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. శుక్రవారం ఉదయం పట్టిసీమ ఎల్‌ఎన్‌డీ కాలనీలో ఆర్టీసీ అధికారులు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వెళుతున్న బస్సును ఆపి తనిఖీ చేయగా జారీ చేసిన టికెట్ల కంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

దీంతో కండక్టర్ పద్మావతి సరిగా విధులు నిర్వర్తించడం లేదంటూ రిమార్క్ రాశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బస్సులోంచి దూకగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement