విద్యుదాఘాతంతో రైతు మృతి | with curent shock farmer died | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 15 2016 5:23 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి - Sakshi

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన తుర్కపల్లి మండలం గంధమల్లలో గురువారం చోటు చేసుకుంది.

తుర్కపల్లి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన  తుర్కపల్లి మండలం గంధమల్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పిట్టల అంజయ్య (55)ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పొలాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో మోటార్‌కు వెళ్లే విద్యుత్‌ వైర్లు అతడి కాలుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక రైతులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement