7 వేల నగదు స్వాధీనం
తర్లుపాడు : ఈ-పాస్ పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి 7 వేల రూపాయల లంచం తీసుకున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సంఘటన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏసీబీ ఒంగోలు ఇన్చార్జ్ డీఎస్పీ దేవానంద్ సాంతో కథనం ప్రకారం.. మండలంలోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన దూళ్ల వెంకట లక్ష్మమ్మ అదే గ్రామానికి చెందిన చింతం రాజయ్య వద్ద ఈ ఏడాది జనవరిలో 28 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేరుుంచుకుంది. తాను కొనుగోలు చేసిన పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేసి ఈ-పాస్ పుస్తకం ఇవ్వాలని వీఆర్వో వెంకట శివ కాశయ్యను ఆమె కోరింది. ఇందుకోసం మీ సేవలో దరఖాస్తు చేసి వీఆర్వోను సంప్రదించింది.
ఇందుకు వీఆర్వో 10 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పటంతో 7 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని వెంకటలక్ష్మమ్మ తమ కుమారుడు వెంకటేశ్వర్లుకు తెలిపింది. అతడు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం రంగుపూసిన నోట్లను ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఆయన నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వీఆర్వోకు ఆ నగదు ఇచ్చాడు. ఆయన ఆ డబ్బులు తీసుకుని డైరీలో పెట్టుకున్నాడు.
ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ దేవానంద్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి వీఆర్వో వెంకట శివ కాశయ్య నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. విషయం క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో కార్యాలయంలోని మిగిలిన సిబ్బంది, వీఆర్వోలు బయటకు పరుగులు తీశారు. ఏసీబీ సీఐలు ప్రతాప్కుమార్, డి.సత్యకుమార్, సంజీవ్కుమార్ పాల్గొన్నారు.
ఏసీబీ వలలో వీఆర్వో
Published Tue, Nov 29 2016 3:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement