పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడి పరారీ | the accused escaped from police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడి పరారీ

Jun 30 2016 10:32 AM | Updated on Oct 8 2018 3:07 PM

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తప్పించుకున్నాడు.

పర్చూరు: పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తప్పించుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్చూరుకు చెందిన ప్రభాకరశర్మ రైతుల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసి, రూ. 2 కోట్ల మేర బాకీ పడ్డాడు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడిని స్టేషన్లో ఉంచారు. గురువారం వేకువజామున ప్రభాకరశర్మ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement