అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | one persion dead | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Jan 27 2017 1:33 AM | Updated on Jul 18 2019 2:26 PM

కడప నగరంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన శివశంకర్‌ (34) అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో మృతి చెందాడు.

కడప అర్బన్‌ :  కడప నగరంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన శివశంకర్‌ (34) అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. శివశంకర్‌ భార్య సుబ్బలక్షుమ్మ 2008లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంబంధిత కేసులో కోర్టుకు వాయిదాలకు తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో కిందపడడంతో తలకు దెబ్బతగిలి మృతి చెందాడు. చిన్నచౌకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement