చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్టవద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్టవద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు నుంచి తిరుపతికి వెళుతున్న బస్సు గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొంది. గమనించిన స్థానికులు 108లో అతణ్ణి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.